సాహిత్య ప్రస్థానం సెప్టెంబరు 2023

ఈ సంచికలో ...

కథలు
మా ఊరి సోనూసూద్‌ : ఉదయమిత్ర
హీరో : వి.రెడ్డెప్ప రెడ్డి
నీ కృప చాలును : కెంగార మోహన్‌

కవితలు
పాట ఆగదు నది ఎండదు : నారమోని యాదగిరి
కవి పుట్టిన సమయం : పద్మావతి రాంభక్త
చీలిన పొద్దు : కంచరాన భుజంగరావు
చంద్రుడిపై పతాకం : రెడ్డి శంకరరావు
అష్టపది : జంగం స్వయంప్రభ
ఆత్మీయత పంచు : కోరాడ అప్పలరాజు
నిష్టూరపు సమయం : కళ్యాణదుర్గం స్వర్ణలత
మా పిల్లాడి మైదానం : గవిడి శ్రీనివాస్‌
తర్వాత ... : అను : జానీ తక్కెడశిల
రెప్ప చాటు స్వప్నం : స్వప్న మేకల
కాలం చెప్పుడు మాటలు వినదు : చందలూరి నారాయణరావు

మన ఊరి సోనూసూద్‌

ఉదయమిత్ర
89196 50545
''ఊరంతా
భయంకర దశ్యాలతో
మునిగిపోయిన తర్వాత
అతను నెమ్మదిగా, ప్రశాంతంగా
అంటుకడుతుంటాడు.''
- బాల సుధాకర్‌ మౌళి
ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద కారు రర్యు న దూసుకుపోతోంది. వర్షం వెలిసి ఎండ కొడుతుండడంతో చెట్లు తలార బోసుకున్నట్లున్నాయి. పేరు తెలువని చెట్లు, భాష తెలువని యాసలో పాడుకుంటూ, ఆదివాసి నాట్యంలాగా, లయబద్ధంగా ఊగుతున్నాయి.
ఙఙఙ
వెనుక సీట్లో మిత్రులు ఇద్దరు ఏవో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ లోకం వాళ్లది .నేను మెల్లగా డ్రైవర్తో మాటలు కలిపాను
మనం వీళ్లను డ్రైవర్లే అనుకుంటాంగానీ, కడుపునిండా ఎన్నెన్ని కథలో. కదిలిస్తే గాని బయటికి రావు.
''నాయక్‌ ..నీకు సొంతం కారు ఉండేదట కదా .ఎప్పుడైనా లాంగ్‌ టూరు పోతుంటివా ''అన్నాను మాటల్లోకి దింపుతూ.
''ఓ ..మస్తుగా వోయిన సార్‌ .తిరుపతి ,తమిళనాడు, కేరళ, కన్యాకుమారి ఇట్లా మస్తు తిరిగిన సార్‌'' అన్నాడు హుషారుగా కారును పోనిస్తూ.

అలంకార గ్రంథాలు ఒక పరిశీలన

డాక్టర్‌ ఆర్‌.కుసుమ కుమారి
కావ్యానుశీలనం చేసే శాస్త్ర గ్రంథాలను కావ్యశాస్త్రాలని, సాహిత్యశాస్త్రాలని అంటారు. వీటికే అలంకార శాస్త్రాలని ప్రచారంలో ఉన్న పేరు. వీటిలో కావ్య సంబంధమైన చర్చలు ఉంటాయి కాబట్టి వీటిని దివ్య విమర్శనా గ్రంథాలని కూడా అనవచ్చు. ఇంకా వీటిల్లో లక్షణాలు, లక్ష్యభూతంగా కావ్యాల సమీక్షలు ఉండటం చేత వీటిని లక్షణ గ్రంథాలని కూడా అంటారు.
అయితే కావ్యాల సాధుత్వాసాధుత్వాలను నిర్ణయించ టానికి, పెడమార్గాన్ని పట్టే కవిత్వాన్ని సంరక్షించటానికి విమర్శన, లక్షణ రూపాలైన కావ్యశాస్త్రాలు ఉదయించాయి. ఈ గ్రంథాలు కేవలం లక్షణాలను చెప్పేవే కాకుండా కావ్య సమీక్షలు కూడా చేయబడేవిగా కూడా ఉంటాయి. వీటిలో కవిత్వదోషాదులు, కవిత గుణాలంకార రసాదులు, కవి ప్రతిభాదులు చర్చించబడి ప్రాచీన కాలంలో కావ్య విమర్శలు జరుగలేదనే లోటును ఈ అలంకార శాస్త్ర గ్రంథాలు తీరుస్తున్నాయి.
లక్షణాలు : అతి ప్రాచీనమైన కాలంలోనే అలంకార శాస్త్ర గ్రంథాలు రచించబడ్డాయి. అలంకార శాస్త్రాల్లో ప్రధానంలో చర్చించబడే అంశాలు : కావ్యనాటక లక్షణాలు, కావ్య సిద్ధాంతాలు, కావ్యభేదాలు, నాయికా నాయక లక్షణాలు. రసవి ప్రముఖ అలంకారికుల గ్రంథాల్లోని విషయాలు చూద్దాం. రూపణం, కావ్యగుణ దోషాలు, శబ్ధశక్తులు, అలంకారాదులు మొదలైనవి.

నీకొచ్చిన భాషలో రాయి నీ విముక్తి కోసం రాయి

గద్దర్‌ - తెలకపల్లి రవి
ముఖాముఖి

సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మా, అంటూ మీ అమ్మ పేరు మీద రాసినదే మీ మొదటి పాట కదా... దానికి ముందు నేపథ్యం ఏమిటి? మీరు పాటగాడు కావడం ఎలా జరిగింది?
మాది ఇక్కడికి దగ్గరే మెదక్‌ డిస్ట్రిక్ట్‌ తూప్రాను. నేను చిన్నప్పటి నుంచే పాటలు పాడేది. కట్టేది. ముఖ్యంగా మా అమ్మ జానపద పాటలు సానా బాగా పాడేది. వాటిల్ల సానా అర్థముండేది. అమ్మ వ్యవసాయ కూలీ. ఫాదర్‌ కాంట్రాక్టులు చేసేది. తమ ప్రోగెసివ్‌ కాంట్రాక్టుల కోసం మహారాష్ట్రలో ఔరంగాబాదు అదంతా పోయేటోడు. అక్కడే అంబేద్కర్‌ వంటి వాళ్ళను గురించి తెలుసుకుని వచ్చాడు. అంబేద్కర్‌ ఉద్యమం బాగా చదువుకోవాల్నెనేటోడు. అందుకే మమ్మల్ను చదివించాడు. మా ప్రాంతంలో హెచ్‌ఎస్‌సి పూర్తి చేసిన ఫస్టు ఎస్‌సిని నేనే. సరే. మా నాయన మొబిలిటీ వల్ల చైతన్యం పెంచుకున్నాడు. మా అక్కలను కూడా ఉద్యోగాలు చేసేటోళ్ళకే ఇచ్చి పెళ్ళి చేసినాడు. సబ్‌కాస్ట్‌ తేడాలు పాటించేటోడు కాదు. ఒకసారి ఎద్దును వండిపెట్టాడు. అలా చేసినందుకు తనను శిక్ష వేసి ఇల్లు గుంజుకున్నారు. అయినా భరించినాడు గాని తలవంచలేదు. నైట్‌ స్కూల్‌ నడిపేది. రాత్రిపూట దీపం జ్యోతి పరంబ్రహ్మం అని పాడించేవాడు. నేను హెచ్‌ఎస్‌సికి వచ్చేసరికి మా నాన్న చనిపోయినాడు. అమ్మనే పెంచింది. అక్కడ జీవితమే నాకు అన్నీ నేర్పించింది.

మహానుభూతి కలిగించిన కాలనాళిక

డాక్టర్‌ తిరునగరి శ్రీనివాస్‌
84660 53933
చరిత్రలో నమోదైన అనేక యుద్ధాలకు, ప్రతిఘటనలకు, ఆత్మార్పణలకు, ఎదురొడ్డిన తిరుగుబాట్లకు కేంద్రస్థానమై పరిఢవిల్లిన చారిత్రాత్మక ప్రాంతం వరంగల్లు. 1945 నుండి 2017 వరకు వరంగల్లు నగర చరిత్రను అధ్యయనం చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని, బహుముఖంగా భారతదేశ చారిత్రక ఔన్నత్యాన్ని అవపోశన పట్టి విశ్లేషించిన నవల రామా చంద్రమౌళి కాలనాళిక. అనేక చారిత్రక సంఘటనల లోతుల్ని, ప్రజా ఉద్యమ పరంపరల్ని తడిమి విస్తారంగా విశ్లేషించిన తీరు ఈ నవల చదివే పాఠకులకు మహానుభూతిని కలిగిస్తుంది.
వందలాది కన్నీటి జ్ఞాపకాలను అగ్ని చినుకుల్లా కురిపించే సంఘటన క్రమాన్ని కాలనాళికలో చూడొచ్చు. తెలంగాణ ప్రాంతమంతా వేల మంది వీరుల ఆత్మార్పణలతో అగ్నిగోళమై మండి రక్తకాసారమై త్యాగాలకు ప్రతీకగా మారిన చారిత్రక సందర్భాలను ఈ నవల తేటతెల్లం చేసింది. పరాయి దోపిడీకి శతాబ్దాలుగా గురై అణగారి పోయిన తెలంగాణ జనసామాన్యం కంట నిండా పారిన కన్నీటిని బిగబడుతూనే అలుపెరగక జరిపిన పోరాటాల వివరణ కన్పిస్తుంది. వెట్టిచాకిరి, బానిసత్వం, నిస్సహాయత, నీ బాంచెను దొరా బతుకులు, చిత్ర హింసలతో ఇక్కడి మనుషుల జీవితాలు కన్నీటి చెరువులయ్యాయి. అన్యాయాన్ని ప్రతిఘటించిన ప్రతి మనిషీ ఒక ఆయుధమై సాయుధుడిగా మారి ప్రత్యక్ష యుద్ధమే చేశాడు. నిరంతర ప్రతిఘటన మధ్య రక్త సిక్తమైన చరిత్ర చిత్రణలో వీరోచిత దృక్కోణాలు ఎన్నో ఉన్నాయి.

హీరో

వంకిరెడ్డి రెడ్డెప్పరెడ్డి
94400 44922
అనంతపురం జిల్లా, కదిరి. ఊరి పేరు వినగానే గుర్తొచ్చేవి ఖాద్రి నరసింహస్వామి గుడి, వేమన పుట్టిన కటారుపల్లి, మేక మార్కు బీడీలు, విస్తారంగా విత్తే వేరుశెనగ, తెలుగు భాషకు సవితి అనిపించే తురక తెలుగు. ఇరుకు వీధులు. వీధుల్ని అడ్డదిడ్డంగా కలిపే సందుగొందులు, ఆ ఇరుకు వీధుల్లోనే కార్లు, బస్సులు, లారీలు, ఆటోలు, మోటార్‌ సైకిళ్ళు, బండ్లు, మనుషులు, ఆవులు, ఎద్దులు, గాడిదలు, గుర్రాలు. సిగరెట్టు పీకలు, బీడీ ముక్కలు, పేడ లద్దెలు, ఆయిల్‌ మరకలు, అరటి తొక్కలు, పేకముక్కలు, గోళీ గుండ్లు, కమ్మర్‌ కట్లు, సమోసాలు, చెకోడీలు అమ్మేవారి అరుపులు. చాలవన్నట్లు పిల్లలూదే పీపీలు, 'చెప్పల్సే మార్‌ రే సాలేకు', 'తేరి మాకీ' అరుపులు, 'బాగున్నావా అక్కా? మామ బాగున్నాడా'? పలకరింపులు. గోళీలాటలు... జీవన రంగులు వెదజల్లే పేదరికానికి అడ్రస్‌ లాంటి టౌను.
ఆ టౌనుకు నేడు కొత్త జీవం వచ్చినట్లైంది.

కవిత్వం జీవధాతువులాగా ఉండాలి

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
ఇప్పుడు అన్ని ప్రక్రియలూ నువ్వా నేనా అన్నట్టు సాంఘిక ప్రసార మాధ్యమాల్లో హౌరెత్తుతున్నాయి. అందువల్ల పద్యమైనా, వచన కవిత్వమైనా దేనికీ ఢోకా లేదన్నారు ప్రముఖ కవి, రచయిత, ప్రతిష్టాత్మక కేంద్రసాహిత్య అకాడెమీ భాషా సమ్మాన్‌ పురస్కార గ్రహీత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. కవి, రచయిత డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య 'సాహిత్య ప్రస్థానం' తరఫున వారితో ముచ్చటించారు. ఆ ముఖా-ముఖి ఇదీ....
మీ బాల్యం విద్యాభ్యాసం క్లుప్తంగా చెప్పండి.

విశ్వ విద్యాలయాల విధ్వంసం !

ప్రభాత్‌ పట్నాయక్‌
బిజెపి పాలనకు ప్రజానీకం ముగింపు పలికిన అనంతరం భారతీయ సమాజానికి, రాజకీయ, ఆర్థిక వ్యవస్థలకు అది కలిగించిన నష్టాన్ని పూడ్చుకునే పని జరుగుతుంది. ఐతే రెండు అంశాలలో అది చేస్తున్న విధ్వంసాన్ని పూడ్చడం చాలా కష్టమౌతుంది. మొదటిది: బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తున్న పురాతన, చారిత్రిక కట్టడాలను తిరిగి నిర్మించుకోవడం. ఈ విధ్వంసం బాబ్రీ మసీద్‌ కూల్చివేతతో మొదలైంది, కేవలం రెండు మతాల ప్రజల నడుమ విద్వేషపూరిత వాతావరణాన్ని సష్టించడం ఒక్కటే కాదది.

జీవన తాత్వికతను ఒంపుకున్న చిన్ని చిన్ని సంగతులు

సురగౌని రామకృష్ణ
79897 23820
''ప్రజల కవివై గొంతు, రగిలించి పాడితే ఒక్కడొక్కలు రేగి ప్రళయమారుతమట్లు తక్కువెక్కువలెల్ల ఒక్క దెబ్బను కూల్చి లోకాలనూగింపరా! ఓ కవీ! శోకాల తొలగింప రా'' అంటూ కవి చైతన్య దీప్తిలా నిలవాలని దిశానిర్దేశం చేశారు తాపీ ధర్మారావు గారు. ''అబద్ధాలాడడమంత సులభం కాదు సుమా! కవిత అల్లడం'' అని దాశరథి కృష్ణమాచార్యులు గారన్నట్టు వాస్తవాలను కవిత్వం చేయడంలో కవికీ నిబద్ధత ఉండాలి.

ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగానే ...

ఎస్‌ఆర్‌ పృధ్వి
99892 23245
ప్రముఖ కవి, విమర్శకుడూ అద్దేపల్లి రామ్మోహనరావు జీవితం సాగరం వంటిది. కవిత్వం కెరటాలై ఉరుకుతుంది. సాగరం నుంచి కెరటాలను ఎలాగైతే విడదీయలేమో, అలాగే అద్దేపల్లి జీవితం నుంచి ఆయన కవిత్వాన్ని విడదీయలేము. ఆయనే అనేక సందర్భాల్లో అన్నారు : ''నాకు జీవితమూ, కవిత్వమూ వేర్వేరు కాదు'' అని. సాహితీలోకం అంగీకరించిన సత్యమిది.

గాంధీ మెమోరియల్‌లో బాపిరాజు స్మరణ

డా. నాగసూరి వేణుగోపాల్‌
94407 32392
సరిగ్గా పదేళ్ళ క్రితం మే మాసం చివరలో, తేదీ కూడా చెప్పాలంటే 2013 మే 27న మదరాసు ఆకాశవాణిలో నేను, బదిలీ మీద కడప నుంచి వచ్చి చేరాను. మదరాసు ఆకాశ వాణిలో ఉద్యోగం చేస్తానని అసలెప్పుడూ ఊహించలేదు, ఎందు కంటే మొదట్లోనే నాన్‌ తెలుగు ఆకాశవాణిలో మూడేళ్లు చేశాను కనుక ఇతర భాషా ప్రాంతాల్లో రేడియో ఉద్యోగం చేయడం ఇష్టంలేదు. మద్రాసు తెలియని ఊరు కాదు, అప్పటికి పుష్కరం క్రితం ఎం.ఏ. జర్నలిజం పరీక్షల కోసం, అలాగే ఆ కోర్సు సంబంధించిన కాంటాక్ట్‌ ప్రోగ్రామ్స్‌ కోసం వెళ్ళి ఉన్నాను నాలుగు సార్లు!