శశిశ్రీ స్మారక సాహిత్య పురస్కారం 2018 కోసం ఆధునిక సాహిత్య అనువాద గ్రంధాలను ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్ షేక్ మస్తాన్వలి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార కమిటీ తరపున కేతు విశ్వనాథ రెడ్డి, షేక్ హుస్సేన్ సత్యాగ్ని, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ అంశాన్ని నిర్ణయించినట్లు తెలిపారు. సంవత్సరానికి ఒకో అంశాన్ని ప్రకటిస్తున్నామని తెలిపారు. 2016 జనవరి నుండి 2018 డిశంబర్ 31 మధ్య కాలంలో ప్రచురితమైన అనువాద గ్రంథాల్ని ఈ పురస్కారం కోసం పంపించవలసిందిగా కోరారు. గ్రంథం కనీసం 100 పేజీలు ఉండాలని, 4 కాపీలను షేక్ మస్తాన్వలి, జర్నలిస్టు, 38-712, పి.ఎస్. నగర్, సెంట్రల్ ప్రిజన్ పోస్టు, కడప - 2 చిరునామాకు పంపించవలసిందిగా కోరారు. ఇతర వివరాలకు 9494111310 ద్వారా సంప్రదించవచ్చును.